చెన్నైలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గాయం కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్తో ఆడటం కష్టంగా మారింది. ఇక, ఈ ఉత్కంఠ బంగ్లాదేశ్ జట్టులో ఆందోళనను పెంచింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో షకీబ్ పరుగులు తీస్తుండగా గాయపడ్డాడు. అయితే, గాయం తర్వాత కూడా అతను తన బ్యాటింగ్ను కొనసాగించాడు. అతను 10 ఓవర్ల కోటాను కూడా బౌల్ చేశాడు.
2023 ప్రపంచకప్లో భారత్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల్లోనూ భిన్నమైన ఆటగాళ్లే భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉంది. అయితే, టీమిండియాకు చెమటలు పట్టించేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. బంగ్లాదేశ్ తనదైన రోజున ఎలాంటి టీంకైనా షాక్ ఇస్తుంటుంది. కాగా, ఈ మ్యాచ్ కూడా అలానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ, ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీంకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లా కీలక ప్లేయర్ షకీబ్ అల్ హసన్ గాయంతో జట్టులో ప్రస్తుతం టెన్షన్ వాతావారణం నెలకొంది.
చెన్నైలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గాయం కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్తో ఆడటం కష్టంగా మారింది. ఇక, ఈ ఉత్కంఠ బంగ్లాదేశ్ జట్టులో ఆందోళనను పెంచింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో షకీబ్ పరుగులు తీస్తుండగా గాయపడ్డాడు. అయితే, గాయం తర్వాత కూడా అతను తన బ్యాటింగ్ను కొనసాగించాడు. అతను 10 ఓవర్ల కోటాను కూడా బౌల్ చేశాడు. ఈ క్రమంలో నొప్పితో పోరాడుతున్నట్లు కనిపించాడు. అయితే, మ్యాచ్ అనంతరం చెన్నైలో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత బయటపడింది.
భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ ఆందోళనలు..
ఇప్పుడు బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్ని అక్టోబర్ 19న టీమ్ ఇండియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ పుణెలో జరుగుతుంది. బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు షకీబ్ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పుణెలో ప్రాక్టీస్ సెషన్లో అతడిని నిశితంగా పరిశీలిస్తాం. షకీబ్ గాయం మెరుగుపడుతోందని మహమూద్ తెలిపాడు. నొప్పి లేదు. వికెట్ల మధ్య కూడా పరుగులు తీస్తున్నాడు. అయితే పూణేలో తుది నిర్ణయం తీసుకుంటాం. అతను భారత్తో ఆడేందుకు ఫిట్గా ఉంటాడని తెలుస్తోంది.